ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ నజీర్, దంత వైద్యులు డాక్టర్ వివేక్.
విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్సలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ నజీర్, దంత వైద్యులు డాక్టర్ వివేక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారంలో సోమ, బుధ, శుక్ర అనగా మూడు రోజులు మాత్రమే దంత వైద్య చికిత్సలను నిర్వహించడం జరుగుతుందన్నారు. నూతన దంత పళ్ళను కట్టుట, పుచ్చిపోయిన పళ్ళను తొలగించుట, దంతములు పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు, దంతములపై అవగాహనను రోగులకు ఇవ్వడం జరుగుతుందన్నారు. అతి చల్లటి పదార్థాలు, కూల్డ్రింక్స్, స్వీట్లు ఎక్కువగా తినరాదని తెలిపారు. నాణ్యమైన దంత వైద్య చికిత్సలను కూడా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.