విశాలాంధ్ర-తాడిపత్రి : పట్టణంలోని శివాలయం వీధి, నందలపాడు, సజ్జలదిన్నె గ్రామంలో తదితరచోట ఉన్న సాయిబాబా దేవాలయంలలో సోమవారము ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు నిర్వహించారు. మొదటగా సాయినాధునికి వేగువ జామునే స్థానం ఆచరింపజేసి అభిషేకాలు, పుష్పాలంకరణ, అర్చనలు, మంగళ హారతులు తదితర ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులు తండోపతండాలుగా విచ్చేసి కాయా కర్పూరం సమర్పించి వారి మొక్కులు, కోరికలు తీర్చుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం మూడు గంటల వరకు ఆలయ కమిటీ, దాతలు, భక్తాదుల సహకారంతో అన్నదానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భక్తులు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.