మండల వ్యవసాయ అధికారి ఎన్ఎం ముస్తఫా
విశాలాంధ్ర – ధర్మవరం : ఖరీఫ్- 2022 కు సంబంధించిన పంటలకు బీమా మంజూరు కావడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి ముస్తఫా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల పరిధిలోని పలు రైతులలో వాతావరణ బీమా కింద- 524 మంది టమోటో రైతులకు-14,95, 438రూ.లు,1171 మంది చీని పంట రైతులకు. రూ.4,14,55,800, అదేవిధంగా 9373 మంది వేరుశనగ రైతులకు రూ.5,45,62,882, తదుపరి దిగుబడి ఆధార భీమా కింద మొక్కజొన్న పంటకు రూ.3,89,522, కందుల పంటకు రూ.2,60,12,450 వెరసి రూ.12,39,16,092 మంజూరు కావడం జరిగిందన్నారు. పంటల బీమాకు సంబంధించిన జాబితాలు రైతు భరోసా కేంద్రాలలో రైతుల పరిశీలనకు, అభ్యంతరాలు తెలియజేయడం కోసం నోటీసు బోర్డు ప్రదర్శించడం జరిగిందని తెలిపారు. కావున ఈ పంటల బీమా అంశాన్ని రైతులు గమనించాలని వారు తెలిపారు.