ఎంపీడీవో సౌజన్యకుమారి
విశాలాంధ్ర- ధర్మవరం : ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అవగాహన కల్పించి, అర్హత గల వారందరికీ కూడా లబ్ధి పొందేలా సేవలు చేయాలని ఎంపీడీవో సౌజన్య కుమారి తెలిపారు. ఈ సందర్భంగా శనివారం వారు మాట్లాడుతూ కునుతురు సచివాలయంలో జగనన్న సురక్ష కార్యక్రమం సర్పంచ్ సత్యమయ్య అధ్యక్షతన జరిగిందని తెలిపారు. గత ఏడు రోజులుగా ఈ కార్యక్రమంలో నిర్వహిస్తున్నామని, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు అందరూ కలిసి ఇంటింటికి తిరిగి ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న 11 రకాల సర్వీసులను గూర్చి వివరించడం జరిగిందన్నారు. తదుపరి మండల ఉపాధ్యక్షులు పాటిల్ కృష్ణారెడ్డి, మండల ప్రత్యేక అధికారి చాంద్ బాషా చేతులు మీదుగా సర్టిఫికెట్లను అందజేయడం జరిగిందన్నారు. ఇప్పటివరకు 750 సర్వీసులను పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఓఆర్డి మమతా దేవి, సూపర్డెంట్ నబి రసూల్, పంచాయతీ కార్యదర్శి సువర్ణ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.