విశాలాంధ్ర – ధర్మవరం:: పట్టణంలోని చక్రవర్తి థియేటర్ ఎదురుగా కేపీటి వీధిలో వెలసిన శ్రీ శివయంబు కాలభైరవ స్వామి ఆలయంలో ఈనెల 8వ తేదీ శుక్రవారం మహాశివరాత్రి పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు అర్చకులు ధనుంజయ ఆచారి, ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శివరాత్రి రోజున సాయంత్రం విశేషమైన పూజలను నిర్వహిస్తామని, కాలభైరవుని చెంతన కాశీ క్షేత్రము నుంచి తెచ్చిన శివలింగానికి పూజలు జరుగుతాయని తెలిపారు. అంతేకాకుండా స్వామి వారిని వివిధ రూపాల్లో అలంకరించడం జరుగుతుందని తెలిపారు. శివరాత్రి రోజు అంతా పూజా కార్యక్రమాలు నిర్వహిరంగా జరుగుతాయని, తదుపరి పానకము, తీర్థప్రసాదాలు కూడా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా భక్తులు తమ శక్తి కొలది విరాళాలు ఇవ్వాలని వారు తెలిపారు.