జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్
విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : జగనన్న పాలవెల్లువ కింద పాలసేకరణను సజావుగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ ఆదేశించారు. గురువారం రాప్తాడు మండలం చాపట్ల గ్రామంలోని జగనన్న పాలవెల్లువ కింద పాలసేకరణ కోసం ఏర్పాటు చేసిన ఎండిఏసీ కేంద్రాన్ని జిల్లా పరిషత్ సీఈవో వైఖోమ్ నిదియా దేవితో కలిసి జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అనంతపురం, ఆత్మకూరు, బుక్కరాయసముద్రం, రాప్తాడు, నార్పల మండలాల్లోని 98 ఏఎంసియులు, 2 బిఎంసియుల ద్వారా పాలసేకరణ రెండు రోజుల కిందట ప్రారంభమైందని తెలిపారు. పాలసేకరణను నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పించి మరింత ఎక్కువమంది పాలు పోసేలా చూడాలన్నారు. జగనన్న పాలవెల్లువ కింద చేపట్టిన పాలసేకరణ కార్యక్రమం వల్ల ఇతర డెయిరీలతో పోల్చితే అమూల్ ద్వారా అధిక ధర లభిస్తోందని తనిఖీ సందర్భంగా మహిళా పాడి రైతులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, మహిళా పాడి రైతులు పాల్గొన్నారు.