స్పందన హాస్పిటల్ అధినేత డాక్టర్ బషీర్
విశాలాంధ్ర – ధర్మవరం : క్యాన్సర్ వ్యాధిపై వాటి లక్షణాలపై ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించి, ఆ కలంకాన్ని తగ్గించాలని స్పందన హాస్పిటల్ అధినేత డాక్టర్ బషీర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా క్యాన్సర్ డే సందర్భంగా వారు ప్రజలకు పలు విషయాలను వెల్లడించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 4వ తేదీన క్యాన్సర్ డే జరుపుకుంటున్నామని, క్యాన్సర్లు బాధల అన్యాయాన్ని అంతం చేయాలన్న లక్ష్యంతో నాటి వైద్యరంగం ముందుకు వెళుతున్న గని తెలిపారు. ముందు దశలోనే క్యాన్సర్ని గుర్తించి సకాలంలో వైద్య చికిత్సలను పొందాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. సోషల్ మీడియా ప్రింట్ అండ్ వారు ప్రచారాల్లో ప్రజల్లో అధికంగా తీసుకొని వెళ్లాలని తెలిపారు. నేడు దేశంలో వందల్లో కేసులు నమోదవుతున్నాయని, క్యాన్సర్ అనేది వ్యక్తులు, కుటుంబాలు, సంఘాలపై విపరీతమైన శారీరక భావోద్వేగ ఆర్థిక ఒత్తిడిని కలిగించే నిరంతర భారంగా మారిందన్నారు. నేడు రోగ నిర్ధారణ చేయబడిన వారి సంఖ్య అధికార లెక్కల ప్రకారం 50 శాతం కు ఉందని తెలిపారు. ప్రాథమిక దశలోనే క్యాన్సర్ ను గుర్తించి వాటికి ముగింపు పలకాలని తెలిపారు. క్యాన్సర్ను ఎంత త్వరగా గుర్తించగలిగితే అంత త్వరగా న్యాయం చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మానవ శరీరంలోని అన్ని కణాలు ఆఖరుకు రక్తంతో సహా అన్ని అవయవాలకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు. మానవ శరీరం లక్షల కోట్ల కణాలతో నిర్మితమైనదని తెలిపారు. క్యాన్సర్ చికిత్సలలో శాస్త్ర చికిత్స విధానములు క్యూ రేటివ్ సర్జరీ ద్వారా క్యాన్సర్ గడ్డలను పూర్తిగా నిర్మూలించవచ్చునని తెలిపారు. పురుషుల్లోప్రా స్టేట్ క్యాన్సర్ను 60 ఏళ్లు దాటిన వారిలో క్యాన్సర్ సాధారణంగా కనపడుతుందన్నారు. నోటి క్యాన్సర్ ను ప్రాథమిక దశలోనే గుర్తించే అవకాశం ఉందని తెలిపారు. కావున ప్రజలు క్యాన్సర్ పట్ల అప్రమత్తంగా ఉంటూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలిపారు.