జగనన్న సురక్ష ద్వారా పేద ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరిస్తామని వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పురుషోత్తం రెడ్డి, మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రశేఖర రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని చిన్న తుంబలం గ్రామంలో ఎంపీడీఓ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఎవరికైనా ప్రభుత్వ సంక్షేమ పథకాలు తమకు అందలేకపోతే జగనన్న సురక్ష కార్యక్రమంలో తమ దృష్టికి తీసుకు వస్తే పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అనంతరం వాలంటీర్లు ఇచ్చిన టోకెన్ల ఆధారంగా కుల, ఆదాయ, జనన, మరణ తదితర ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బడెమ్మ, ఈఓఆర్డి జనార్ధన్, ఆర్ ఐ మహేష్, సొసైటీ అధ్యక్షులు రవీంద్ర, పంచాయతీ కార్యదర్శి అయ్యప్ప రెడ్డి, గొర్రెల ఫెడరేషన్ జిల్లా డైరెక్టర్ కె యల్లప్ప అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.