బత్తలపల్లి ఎంఈఓ సుధాకర్ నాయక్
విశాలాంధ్ర – ధర్మవరం : ప్రతి పాఠశాలలో ప్రతి తరగతిలోని విద్యార్థికి పూర్తి దశలో ఉపాధ్యాయులు తమ బోధనను నాణ్యతగా అందించినప్పుడే మంచి గుర్తింపు లభిస్తుందని బత్తలపల్లి ఎంఈఓ సుధాకర్ నాయక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎంఈఓ కార్యాలయంలో సుధాకర్ నాయక్ బత్తలపల్లికి బదిలీ అయిన సందర్భంగా ఆత్మీయ సమ్మేళన సభను ఏర్పాటు చేశారు. ఈ సభ ధర్మవరం అర్బన్,రూరల్, మున్సిపల్ ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించుకున్నారు. పలువురు సీనియర్ ఉపాధ్యాయులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాడు నేడు, అమ్మఒడి, జగనన్న విద్యా దీవన పథకాలను అన్ని పాఠశాలలకు సకాలంలో అందే విధంగా సుధాకర్ నాయక్ కృషి అనన్యనీయమని తెలిపారు. ఉపాధ్యాయుల, అధికారుల వద్ద విద్యకు సంబంధించిన పనులను, అందరి సహాయ సహకారాలతో,ముందుకు తీసుకెళుతూ, మంచి మన్ననలు పొందడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ముదిగుబ్బ, ధర్మవరం మండలాలకు ఎంఈఓ గా ఉంటూ, నిరంతరం తన విధులను నిర్వర్తించడం ఆషామాసి పని కాదని, ఎంత కష్టమైనా పని ముగించేంతవరకు నిద్రపోయేవారు కాదని తెలిపారు. ఇటువంటి వారికి బదిలీ రావడం బాధాకరమైన, ఉద్యోగములో బదిలీ అన్నది ఒక భాగమని తెలిపారు. అనంతరం సుధాకర్ నాయక్ మాట్లాడుతూ అందరి సహాయ సహకారాల వల్లనే రెండు మండలాలలో ఎంఈఓ విధులను కీలకంగా నిర్వహించడానికి ఉపాధ్యాయుల, ఎమ్మార్సీ సిబ్బంది వల్లనే అది సాధ్యమైందని తెలుపుతూ, ఇంతటి విజయానికి కారకులైన అందరినీ పేరుపేరునా వారు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఎంఈఓ సుధాకర్ నాయక్ ను, స్థానిక ఎంఈఓ లు గోపాల్ నాయక్, రాజేశ్వరి దేవి లతోపాటు, ఉపాధ్యాయ బృందం, ఎంఈఓ కార్యాలయ సిబ్బంది ఘనంగా పూలమాలలతో, శాలువాలతో, జ్ఞాపికలతో సత్కరించారు.