టిడిపి రాష్ట్ర కార్యదర్శి కమతం కాటమయ్య
విశాలాంధ్ర – ధర్మవరం:: జనసేన టిడిపి పొత్తుతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని టిడిపి రాష్ట్ర కార్యదర్శి కమతం కాటమయ్య పట్టణ అధ్యక్షులు తెలిపారు.. ఈ సందర్భంగా వారు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ ఆదేశాల మేరకు పట్టణ టిడిపి ప్రచార కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని 39 వ వార్డులోని రాంనగర్లో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు ఇంటింటా తిరుగుతూ చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరించారు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి ఐదేళ్లు గడుస్తున్న నాసి రోడ్లు డ్రైనేజీలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు దుయ్యబట్టారు. అంతేకాకుండా పట్టణంలో చేనేత వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయ్యిందని, ప్రభుత్వం పట్టీ పట్టనట్లు ఉండడం వల్లనే చేనేత పరిశ్రమ కనుమరుగు అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రభుత్వం అందించే నేతన్న నేస్తం పథకం వైసీపీ అనుచరులకు ఇచ్చారే తప్ప, అర్హులైన చేనేతలకు మొండి చేయి చూపడం దారుణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాళ్లపల్లి షరీఫ్ ,అశోక్, మాధవరెడ్డి, గోసల శ్రీరాములు, అంబటి సనత్, బోయ రవిచంద్ర, మారుతి స్వామి, భీమనేని ప్రసాద్ నాయుడు, జిలకర శీన, కొత్తపేట ఆది, మాదన సుబ్బయ్య ,సంజీవులు, అత్తర్ రహీం భాషా తదితరులు పాల్గొన్నారు. మృతి చెందిన మదర్ ఎలిజిబెత్కు నివాళులు అర్పించిన టిడిపి నాయకులు::: పేదవాళ్ల కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలను అతి తక్కువ ఫీజుతో తాను స్థాపించిన జీవనజ్యోతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో వందలాది మందికి విద్యను అభ్యసించి, నేడు ఉన్నత ఉద్యోగులలో స్థిరపడిన వారి గురువు ఎలిజిబెత్ (94) మృతి చెందడం పట్ల టిడిపి నాయకులు, కార్యకర్తలు మృతదేహం వద్ద నివాళులర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు.