విశాలాంధ్ర -ఆత్మకూర్ : నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి ఆయకట్టుకి నీరు అందించాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ఆవరణంలో సిపిఐ నాయకులు శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ… గత ఎన్నికల్లో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా లక్ష ఎకరాలకు సాగునీటిని అందిస్తామని చెప్పి ఒక ఎకరాకు అందించలేదని మండిపడ్డారు. ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని చెరువులు ఎండిపోయే స్థితిలో ఉన్నాయని వాటిని ఎప్పుడు నింపుతారని ప్రశ్నించారు. తోపుదుర్తి ముత్యాల రిజర్వాయర్లను నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పిన ఎమ్మెల్యే నేటి వరకు కనీసం ఒక గంప మట్టినైన తరలించలేదని ఎద్దేవా చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని చెరువులను వెంటనే నీటితో నింపి రిజర్వాయర్ల నిర్మాణానికి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ రాప్తాడు నియోజకవర్గం సహాయక కార్యదర్శి శ్రీకాంత్ ఆత్మకూరు మండల కార్యదర్శి రామకృష్ణ సహాయక కార్యదర్శి శివ రామాంజనేయులు ఓబులేసు తదితరులు పాల్గొన్నారు