Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

మొక్కలు నాటకుండానే రూ. లక్షలు మింగేశారు

-వైసీపీ నాయకుల వలన సామాన్య రైతులకు అన్యాయం
-ఫారం పాండ్స్ నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే సునీత

విశాలాంధ్ర-రాప్తాడు : నీరు-చెట్టు పథకం కింద గత వైసీపీ ప్రభుత్వంలో మొక్కలు నాటకుండానే వైసిపి నాయకులు రూ.లక్షలు మింగేశారని ఎమ్మెల్యే పరిటాల సునీత విమర్శించారు.
డ్వామా ఆధ్వర్యంలో వాటర్ షెడ్ పథకం కింద రైతులకు సుమారు రూ.3 కోట్ల విలువ చేసే పనుల్లో భాగంగా హంపాపురంలో రూ. 1కోటి, గొందిరెడ్డిపల్లి గ్రామంలో రూ.1.20కోట్లు, రామినేపల్లి గ్రామంలో రూ.60 లక్షల పనులు మిషన్ ఫారం పాండ్స్, చిన్న నీటి కుంటలు, చెక్ డ్యామ్ లు మంజూరు కాగా శుక్రవారం ఎమ్మెల్యే పరిటాల సునీత భూమిపూజ చేశారు. పరిటాల సునీత మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో తొలిసారి ఫారం పాండ్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలు అభివృద్ధి వైపు చూస్తున్నాయని, రైతులకు మేలు చేసే కార్యక్రమాలు ప్రారంభమయ్యాయన్నారు. గతంలో నిధులు పక్కదారి పట్టడంపై వీటిపై అప్పట్లోనే తాము ఫిర్యాదులు చేశామన్నారు. ప్రస్తుతం రైతులు తమ భూముల్లో వీటి నిర్మాణాలు చేపట్టాలన్నారు. స్థలం వృథా అవుతుందని నిర్మాణాలకు ముందుకు రాకపోతే భూగర్భ జలాల విషయంలో అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏపీడీలు అనురాధ, సుధాకర్ రెడ్డి, ఎంపీడీఓ సాల్మన్, టీడీపీ మండల ఇంచార్జి ధర్మవరవు మురళీ, కన్వీనర్ పంపు కొండప్ప, ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి శీనా, ఏపీఓ సావిత్రి, టెక్నికల్ అసిస్టెంట్ హజరా, ఎంపీటీసీలు జాఫర్, మోదుపల్లి రవి, సర్పంచులు మిడతల శీనయ్య, సాకే తిరుపాలు, నాయకులు జయప్ప, మరూరు గోపాల్, సోంభాస్కర్, నంబూరి నాగరాజు, మధు, ప్రతాప్, శ్రీధర్, బాలగొండ మల్లికార్జున, ఉజ్జినేశ్వర్, జయరాముడు తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img