Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట.. మొత్తానికి ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టులో ఊరట లభించింది. ఈఎల్స్‌ (ఆర్జిత సెలవుల) పై విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతించింది. ఆయన విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఏబీవీకి అనుమతి నిరాకరిస్తూ సీఎస్‌ ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్‌ చేసింది. ఈ పిటిషన్పై సోమవారం వాదనలు పూర్తికాగా.. మంగళవారం నిర్ణయాన్ని ప్రకటిస్తామని జడ్జి తెలపారు. కానీ సాంకేతిక కారణాలు చూపుతూ మంగళవారం అనుబంధ పిటిషన్‌ను తోసిపుచ్చిన సంగతి తెలిసిందే.సీఎస్ అనుమతి నిరాకరిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్‌ చేయాలని అనుబంధ పిటిషన్లో కోరకుండా విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరడాన్ని ప్రస్తావించారు. దీంతో అనుబంధ పిటిషన్ను కొట్టేస్తున్నట్లు.. విచారణను ఈ నెల 7కి వాయిదా వేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. వెంటనే ఏబీ తరఫు లాయర్ తాము దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌లో పొరపాటు కారణంగా పిటిషనర్‌ వ్యక్తిగత స్వేచ్ఛపై ప్రభావం పడుతోందన్నారు. తమకు లోపాన్ని సరిదిద్దుకొని వెంటనే అనుబంధ పిటిషన్‌ దాఖలు చేస్తానని చెప్పారు. కోర్టు అనుమతించింది.. మధ్యాహ్నం విచారణ జరిపి బుధవారానికి విచారణ వాయిదా వేసింది. అనంతరం అనుబంధ పిటిషన్పై విచారణ జరిపి గురువారం తీర్పును ఇచ్చింది.విదేశీ పర్యటనకు అనుమతించాలని ఇటీవల సీఎస్‌కు ఏబీవీ దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ అభ్యర్థనను సీఎస్‌ తిరస్కరించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. వెంకటేశ్వరరావు తాను విదేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలని సీఎస్‌ను కోరారు.. అయితే ఆ అభ్యర్థనను నిరాకరించడంతో హైకోర్టులో సవాల్ చేశారు. కోర్టు విచారణ జరిపి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది.సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు గత ప్రభుత్వ హయాంలో ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విధులు నిర్వర్తించారు. 2019 ఎన్నికల సమయంలో ఏబీపై వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపణలు చేశారు.. నేరుగా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన్ను బదిలీ చేశారు. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన్ను మళ్లీ బదిలీ చేసి పోస్టింగ్ ఇవ్వకపోవడంతో.. తనకు పోస్టింగ్‌ ఇప్పించాలంటూ ఐపీఎస్‌ అధికారుల సంఘాన్ని ఆశ్రయించారు వెంకటేశ్వరరావు.కొంతకాలానికి నిఘా పరికరాల కొనుగోలులో అక్రమాలు జరిగాయంటూ ఏబీపై అభియోగాలు వచ్చాయి. దీంతో 2020 ఫిబ్రవరి 8న వెంకటేశ్వరరావును ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. అయితే వెంకటేశ్వరరావు ప్రభుత్వ ఆదేశాలను హైకోర్టులో సవాల్ చేశారు.. కోర్టు ఆ సస్పెన్షన్‌ను ఎత్తివేయడంతో ఊరట లభించింది. ఆ వెంటనే ఏపీ ప్రభుత్వం హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో అప్పీల్ చేయగా.. అక్కడా ఏబీకి రిలీఫ్ దక్కింది. దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా ఆయన్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది.2021 డిసెంబరు 16న వెంకటేశ్వరరావును ఉద్యోగం నుంచి డిస్మిస్‌ చేయాలంటూ కేంద్రానికి ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించింది. కానీ యూపీఎస్సీ రెండు ఇంక్రిమెంట్లు నిలిపేయాలని సిఫార్సు చేసింది.. ఈ మేరకు ఇంక్రిమెంట్‌ కట్‌ చేయబోతున్నామని ప్రభుత్వం తెలిపింది. ఇప్పుడు మళ్లీ సెలవులపై విదేశాలకు వెళ్లే అంశంలో వెంకటేశ్వరరావు కోర్టును ఆశ్రయించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img