ముంబయి: ఓలా ఎలక్ట్రిక్ తన ఎస్1 స్కూటర్ పోర్ట్ఫోలియోపై మార్చినెలలో రూ.25,000 వరకు ధర తగ్గింపును ప్రకటించింది. ఈ ప్రకటన భారతదేశం వాహనరంగ విద్యుదీకరణ ప్రయత్నాలను వేగవంతం చేయడానికి, ఈవి స్వీకరణకు ఉన్న అన్ని అడ్డంకులను అధిగమించడానికి కంపెనీ అతిపెద్ద కర్తవ్యాన్ని కొనసాగించడం లక్ష్యంగా పెట్టుకుంది. అద్భుతమైన వెర్టికల్లి ఇంటిగ్రేటెడ్ అంతర్గత సాంకేతికత, తయారీ సామర్థ్యాలు, ఉత్పాదక ప్రోత్సాహకాలకు అర్హతతోపాటు కంపెనీ బలమైన వ్యయ నిర్మాణం కారణంగా ఓలా తమ వాహనాలను అత్యంత సరసమైన ధరలో అదించగలుగుతుంది.ఫేమ్ 2 (ఫాస్టర్ అడాప్షన్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ) పథకం 2024 మార్చి 31న ముగిసే అవకాశం ఉన్నందున, ఈవిల ధరల్లో మార్పులు ఉండవచ్చు. కావున, ఓలా ఎస్1ని కొనుగోలు చేయడానికి ఇదే ఉత్తమ సమయం. ఇది సంవత్సరానికి రూ 30,000 వరకు పొదుపుకు అవకాశాన్ని ఇస్తుంది.