హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద వెర్టికల్ ఇంటిగ్రేటెడ్ హెల్త్కేర్ ప్రొవైడర్ అపోలో, అపోలో ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ ప్రారంభించిన నాటి నుండి ఇప్పటి వరకు 23,000కు పైగా అవయవ మార్పిడిలను పూర్తి చేసినట్లుగా ప్రకటించింది. అపోలో ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ ప్రపంచంలోని అత్యంత అధునాతనమైన, సమగ్రమైన ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్లో ఒకటిగా, అత్యాధునిక సేవలకు ప్రసిద్ధి చెందింది. 2012 సంవత్సరం నుండి, ఈ ప్రోగామ్ ద్వారా సంవత్సరానికి సగటున 1200 అవయవ మార్పిడిలను నిర్వహిస్తున్నది. 2020 సంవత్సరంలో కోవిడ్ మహమ్మారి గరిష్ట స్థాయికి చేరుకున్నప్పటికీ, ఆ సంవత్సరం కూడా 814 కు పైగా అవయవ మార్పిడిలు జరిగాయి. ఏది ఏమైనప్పటికీ, 2022లో ఈ కార్యక్రమం అత్యధికంగా 1641 అవయవ మార్పిడిలతో సరికొత్త శిఖరాలకు చేరుకున్నది.