భువనేశ్వర్: భారతదేశపు ప్రముఖ వాహన తయారీసంస్థ అయిన టాటా మోటార్స్, ఒడిశాలోని భువనేశ్వర్లో తన రెండవ రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ(ఆర్వీఎస్ఎఫ్)ని ప్రారంభించడంతో సుస్థిరమైన మొబిలిటీ పట్ల తన నిబద్ధతను కొనసాగిస్తోంది. రీసైకిల్ విత్ రెస్పెక్ట్’ అని పేరు పెట్టబడిన ఈ అధునాతన కేంద్రాన్ని ఒడిశా ప్రభుత్వ జలవనరులు, వాణిజ్యం, రవాణా శాఖ మంత్రి తుకుని సాహు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఒడిశా ప్రభుత్వం, టాటా మోటార్స్ నుండి వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ అత్యాధునిక కేంద్రం పర్యావరణ అనుకూల ప్రక్రియలను ఉపయోగిస్తుంది. ప్రతి సంవత్సరం 10,000 దాకా కాలం చెల్లిన వాహనాలను సురక్షితంగా, సుస్థిరదాయకంగా విడదీయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఆర్వీఎస్ఎఫ్ అన్ని బ్రాండ్లకు చెందిన కాలం చెల్లిన ప్యాసింజర్, వాణిజ్య వాహనాలను స్క్రాప్ చేయడానికి వీలుగా టాటా మోటార్స్ భాగస్వామి ఎంప్రెయో ప్రీమియం ద్వారా అభివృద్ధి చేయబడి, నిర్వహించబడుతోంది.