Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

మంత్రి గుడివాడ అమర్నాథ్ ను కలిసిన యస్. రాయవరం వైసీపీ నాయకులు

విశాలాంధ్ర – యస్. రాయవరం : రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ ను యస్. రాయవరం మండలం వైసీపీ నాయకులు కలిసారు. మంత్రి గుడివాడ ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా అనకాపల్లి జిల్లా యస్. రాయవరం మండలం అడ్డురోడ్డు జంక్షన్ వద్ద వైసీపీ జిల్లా కోశాధికారి బొలిశెట్టి గోవిందరావు ఆధ్వర్యంలో కలిసి  సత్కరించారు. మండలంలోని గల పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కాకర దేవి, వైసీపీ మండల కన్వీనర్ కొణతాల శ్రీనివాసరావు, సర్పంచులు, ఎంపిటిసిలు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img