Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

మ‌ణిపూర్ అల్ల‌ర్ల వెనుక బీజేపీ ప్ర‌భుత్వం కుట్ర‌లు : నారాయ‌ణ

తెలుగు రాష్ట్రాలకు బీజేపీ తీరని అన్యాయం

మ‌ణిపూర్ అల్ల‌ర్ల విషయంలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒకవైపు కొన్ని నెలలుగా అల్లర్లు జరుగుతుండగా, మ‌హిళ‌ల‌ను వివస్త్రగా చేసి లైంగిక వేధింపులకు పాల్పడి హత్య చేసిన ఉదంతం బయటికు రాగానే కేంద్రం స్పందించడం విడ్డూరంగా ఉందన్నారు. ఇన్నాళ్లు మ‌ణిపూర్ అల్ల‌ర్ల‌పై స్పందించ‌ని ప్రధాని, పార్లమెంటు లోపల మాట్లాడాల్సిన‌ అంశాన్ని, మీడియాతో మాట్లాడటం ఏమిటని ఆయన ప్రశ్నించారు. దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బీజేపీ నంబ‌ర్ వ‌న్ బ్లాక్ మెయిలింగ్ పార్టీలా మారిందని ఆరోపించారు. మణిపూర్‌లో అదానీ కంపెనీలకు 55 వేల ఎక‌రాల‌ భూములు కట్టబెట్టడానికే తెగల మధ్య రిజర్వేషన్ అంశాలపై కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జులై 26న దేశవ్యాప్తంగా సేవ్ మణిపూర్ పేరుతో సీపీఐ మణిపూర్‌కు మద్దతుగా కార్యక్రమాలు చేపడుతోందన్నారు. తెలుగు రాష్ట్రాలకు బీజేపీ తీరని అన్యాయం చేసిందన్నారు. కేంద్రం విభజన చట్టాలను అమలు చేయడం లేద‌న్నారు. బయ్యారం స్టీల్ ప్లాంట్ గురించి పట్టించుకోవడం లేదని, కాజీపేటలో రైల్వే కోచ్ ఏర్పాటు చేయాలనేది 30-40 ఏళ్ల కల అని పేర్కొన్నారు. కోచ్ ఫ్యాక్టరీ స్థానంలో రూ. 500 కోట్లతో డబ్బా రేకులు తెచ్చి పెట్టారని విమర్శించారు. గుజరాత్‌లో రూ. 20 వేల కోట్లతో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img