Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

బాలికల అదృశ్యం వాస్తవమే

. లెక్కలతో వివరించిన కేంద్రం
. ఏపీ, తెలంగాణలో 72,767 మంది మిస్సింగ్‌

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఏపీలో మహిళల అదృశ్యానికి సంబంధించి కొద్దిరోజులుగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బుధవారం పార్లమెంటు సాక్షిగా లెక్కలతో సహా ఎంతమంది కనిపించకుండా పోయారో తేల్చిచెప్పింది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇటీవల ఈ వ్యవహారాన్ని వలంటీర్లకు లింక్‌ చేస్తూ విమర్శలు చేయడం రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపింది. పవన్‌ కల్యాణ్‌ నిరాధారంగా తమపై ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నేతలు, మంత్రులు ఘాటుగా కౌంటర్లు ఇచ్చారు. చివరకు మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ కూడా రంగంలో దిగి పవన్‌ కల్యాణ్‌కు షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. పవన్‌ కల్యాణ్‌పై ఒకరిద్దరు వలంటీర్లు పోలీస్‌ స్టేషన్‌లో కేసు కూడా నమోదు చేశారు. కానీ మహిళల మిస్సింగ్‌ నిజమేనని కేంద్రం పార్లమెంటులోనే తేల్చేసింది. రాజ్యసభలో కొందరు సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా లిఖితపూర్వక సమాధానమిచ్చారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 2019 నుంచి 2021 మధ్య మహిళలు, బాలికల అదృశ్యంపై కేంద్ర హోంశాఖ వివరాలు వెల్లడిరచింది. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 72,767 మంది అదృశ్యమైనట్లు పార్లమెంటుకు నివేదించింది. జాతీయ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో లెక్కల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో మహిళలు అదృశ్యమవుతున్న కేసులు ఏటేటా పెరుగుతున్నట్లు వెల్లడిరచింది. ఏపీలో 2019 నుంచి 2021 వరకు మొత్తం 7928 మంది బాలికలు, 22,278 మంది మహిళలు అదృశ్యమైనట్లు పేర్కొంది. 2019లో 2186 మంది బాలికలు, 6252 మంది మహిళలు, 2020లో 2374 మంది బాలికలు, 7057 మంది మహిళలు, 2021లో 3358 మంది బాలికలు, 8969 మంది మహిళలు అదృశ్యమైనట్లు కేసులు నమోదయ్యాయని పేర్కొంది. మరో తెలుగు రాష్ట్రం తెలంగాణలో సైతం మహిళలు, బాలికల మిస్సింగ్‌ కేసులు మరింత ఎక్కువగా ఉన్నట్లు హోంశాఖ గణాంకాలు వెల్లడిరచాయి. 2019 నుంచి 2021 వరకు తెలంగాణలో మొత్తం 8066 మంది బాలికలు, 34,495 మంది మహిళలు అదృశ్యమయ్యారు. ఇందులో 2019లో 2849 మంది బాలికలు, 10,744 మంది మహిళలు మిస్సయ్యారు. 2020లో 2232 మంది బాలికలు, 10,917 మంది మహిళలు అదృశ్యం కాగా.. 2021లో 2994 మంది బాలికలు, 12,834 మంది మహిళలు అదృశ్యమైనట్లు కేసులు నమోదయ్యాయని కేంద్రం తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img