Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

పోలవరానికి జగనే శని… చంద్రబాబు

నేడు పోలవరం ప్రాజెక్టుపై మీడియా సమావేశం

రివర్స్ టెండరింగ్ తో జగన్ రాష్ట్రాన్నే రివర్స్ చేశాడని, డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడానికి జగన్ మూర్ఖపు నిర్ణయాలే కారణమని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలను అన్ని వ్యవస్థలు తప్పు పట్టాయని వెల్లడించారు. రాష్ట్రంలోని వివిధ జల ప్రాజెక్టులపై నిన్న పార్టీ ప్రధాన కార్యాలయంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన చంద్రబాబు…. నేడు ప్రధానమైన పోలవరం ప్రాజెక్టు విషయంలో పవర్ ఫుల్ ప్రంజటేషన్ ఇచ్చారు.పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నాటినుంచి నేటి వరకు జరిగిన సంఘటనలను మీడియా సమావేశంలో ఎలక్ట్రానిక్ స్క్రీన్ పై వివరించారు.

పోలవరం ప్రాజెక్టుకు టీడీపీ హయాంలో రూ.11,537 కోట్లు ఖర్చు చేస్తే… వైసీపీ రూ.4,611 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని స్పష్టం చేశారు. నాడు పరిహారంపై ప్రగల్భాలు పలికిన జగన్… నేడు ముంపు బాధితలను ముంచేశాడని అన్నారు. నదుల అనుసంధానంతో రాష్ట్రం మెడలో మణిహారం వేద్దాం అని తాను భావిస్తే… ఆ కలను జగన్ నాశనం చేశాడని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నదుల అనుసంధానం చేయాలన్న ప్రగాఢ ఆకాంక్షతో పోలవరం నిర్మాణానికి సిద్ధపడ్డాను. అలాంటి ప్రాజెక్టును దుర్మార్గులు అహంకారంతో చేజేతులా నాశనం చేశారు. అందుకే అంటున్నాం…. పోలవరానికి జగనే శని అని అన్నారు.

ఇంత వరద ఎక్కడా రాదు

50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే ఏకైక నది గోదావరి. 100 మీటర్ల లోతైన డయాఫ్రమ్ వాల్ పోలవరం ప్రత్యేకత. దేశంలో ఏ ప్రాజెక్ట్ కు ఇంత లోతులో డయాఫ్రమ్ వాల్ నిర్మించలేదు. 20 మీటర్ల ఎత్తు, 15 మీటర్ల వెడల్పున్న అతిపెద్ద గేట్లు, 354 కిలోమీటర్ల పొడవున్న కుడి, ఎడమ కాలువలు. నిర్మాణపరంగా దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది. 24 గంటల్లోనే 32,315 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వర్క్ తో గిన్నిస్ రికార్డులకు ఎక్కింది. పోలవరం నుంచి భద్రాచలం వరకు పాపికొండలు, బ్రహ్మండమైన అటవీప్రాంతంతో పర్యాటకాభివృద్ధికి గొప్ప అవకాశాలు ఉన్నాయి అని వివరించారు.

టీడీపీ హయాంలో పోలవరం పురోగతి

నేను ముఖ్యమంత్రి అవుతూనే ప్రాజెక్ట్ నిర్మాణంపై ఆలోచించాను. ఎన్.డీ.ఏ ప్రభుత్వా న్ని కలిసి, ప్రాజెక్ట్ నిర్మాణానికి అత్యంత కీలకమైన 7 ముంపు మండలాలను తెలంగాణ నుంచి ఏపీలో కలపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాను. ఆ 7 మండలాలు రాకపోతే ప్రాజెక్ట్ పూర్తికాదు… తద్వారా ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేయలేనేమో అని భావించాను. అందుకే ముంపు మండలాలను విలీనం చేస్తే తప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనని చెప్పాను. 7 మండలాలను ఏపీలో కలుపుతూ ఆర్డినెన్స్ జారీచేశారు. తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధికి, నాటి ఎన్.డీ.ఏ సహకారానికి ఇదే నిదర్శనం అని అన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img