Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఆఫ్ట్రాల్ పరీక్షలే నిర్వహించలేరు..తెలంగాణతో ఏపీకి పోలికా… : మంత్రి బొత్స

విజయవాడలో ఆర్జీయూకేటీ ఆధ్వర్యంలోని 4 ట్రిపుల్‌ ఐటీలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఈ క్రమంలో తెలంగాణ విద్యా వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. కనీసం టీచర్లు బదిలీలు చేసుకోలేని దుస్థితి ఉందన్నారు. కమిషన్ పరీక్షలు నిర్వహించుకోలేరని.. అక్కడ ఎలాంటి కుంభకోణాలు జరిగాయో అందరికీ తెలుసన్నారు. అలాంటిది ఏపీకి తెలంగాణతో పోలికా అంటూ సీరియస్ కామెంట్స్ చేశారు మంత్రి. తెలంగాణ విద్యా వ్యవస్థపై ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ విద్యా విధానాన్ని తెలంగాణతో పోల్చి చూడటం సరికాదన్నారు. తెలంగాణ విద్యా వ్యవస్థలో చూచిరాతలు, కుంభకోణాలు రోజూ చూస్తూనే ఉన్నామని.. ఉపాధ్యాయుల బదిలీలు కూడా చేసుకోలేని దుస్థితి తెలంగాణదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయవాడలో ఆర్జీయూకేటీ ఆధ్వర్యంలోని 4 ట్రిపుల్‌ ఐటీలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఈ క్రమంలో తెలంగాణ విద్యా వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. మన విధానం మనది, మన ఆలోచనలు మనవి అన్నారు. ఆఫ్ట్రాల్ సర్వీస్ కమిషన్ పరీక్షలనే నిర్వహించుకోలేని పరిస్థితి తెలంగాణలో ఉందని.. తెలంగాణ సర్వీస్ కమిషన్ పరీక్షల్లోనే ఎలాంటి స్కాం‌మ్‌లు జరిగాయో చూశామన్నారు. అన్ని చూచిరాతలే.. ఎంత మంది అరెస్టులు అవుతున్నారో వార్తలు వస్తూనే ఉన్నాయన్నారు. టీచర్ల బదిలీలే చేసుకోలేని పరిస్థితి తెలంగాణలో ఉందని అన్నారు. అలాంటిది ఏపీకి తెలంగాణతో పోలికా అంటూ కామెంట్స్ చేశారు.అందుకే ఒక రాష్ట్రాన్ని ఇంకో రాష్ట్రంతో పోల్చకూడదని.. ఎవరి ఆలోచన వారిది, ఎవరి విధానం వారిదే అని వ్యాఖ్యానించారు. గతంలో కూడా ఏపీ, తెలంగాణ మంత్రుల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఏపీలో రోడ్లు, విద్యుత్‌ సతహా పలు అంశాలపై ఇరు రాష్ట్రాల మంత్రులు, నేతలు ఘాటు విమర్శలు చేసుకున్నారు. తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ తెలంగాణ విద్యా వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు కూడా హీట్ పెంచేలా ఉన్నాయి.

మరోవైపు ఆర్జీయూకేటీ ఆధ్వర్యంలోని 4 ట్రిపుల్‌ ఐటీలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో విడుదల చేశారు. రాష్ట్రంలో ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళంలో క్యాంపస్‌లో కలిపి మొత్తం 4,400 సీట్లు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. ఈ నెల 20 నుంచి 25 వరకు ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టాప్ 20 వచ్చిన విద్యార్థులు అందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారేనని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు మంచి విద్య అందించాలనే లక్ష్యంతో అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆర్జీయూకేటీలను ప్రారంభించారన్నారు మంత్రి బొత్స. 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు కోసం పదవ తరగతి మార్కులే ప్రాతిపదికని.. రాష్ట్ర వ్యాప్తంగా 4,400 సీట్లు ఉన్నాయన్నారు. వీటి కోసం 38,355 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని.. ఒక్కో క్యాంపస్ లో 1100 సీట్లను భర్తీ చేస్తున్నామన్నారు. పదవ తరగతిలో 600కు గాను 598 మార్క్‌ల నుంచి విద్యార్థి దరఖాస్తు చేసుకోవటం ఈ సంస్థ ప్రతిష్ట తెలుస్తుందన్నారు. జనరల్ కటాఫ్ మార్క్ 583 అని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img