విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : రాబోయే ఎన్నికల్లో ఉపయోగించే ఈవీఎంలపై మండల పరిధిలోని మేకడోన, ముచ్చిగిరి గ్రామాల్లో సోమవారం ఈవీఎంలపై ప్రజలకు వీఆర్ఏలు అవగాహన కల్పించారు. గ్రామంలో ప్రధాన కూడలిలో ఓటర్లను పిలిచి ఈవీఎం నమూనాను చూపిస్తూ ఓటు ఎలా వెయ్యాలని, ఓటు వేసిన తర్వాత పూర్తయినట్లు సంకేతం ఏమిటి అనే విషయాలపై వీఆర్ఏలు అవగాహన కల్పించారు. ఈవీఎంల అవగాహనకు ఓటర్ల నుంచి విశేష స్పందన లభించింది.