Monday, May 20, 2024
Monday, May 20, 2024

ముఖ్యమంత్రి జగన్ పని అయిపోయింది

కాంగ్రెస్ కు పూర్వ వైభవం ప్రారంభమైoది
వైకాపా శ్రేణులారా…? కాంగ్రెస్ లోకి తిరిగి రండి..
రాజశేఖర్ రెడ్డి ఆశయాలను నెరవేరుద్దాం….. నర్రెడ్డి తులసీరెడ్డి..

విశాలాంధ్ర – ఆళ్లగడ్డ (నంద్యాల జిల్లా) : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పని అయిపొయిందని.. వైకాపా మునిగి పోయే పడవ అని, కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం ప్రారంభమైoదని వైకాపా నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ లోకి తిరిగి రావాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చెర్మన్ నర్రెడ్డి తులసి రెడ్డి పిలుపు నిచ్చారు. పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా చిత్తుచిత్తుగా ఓడిపోతుందన్నారు. రాష్ట్రoలోని అన్ని వర్గాల ప్రజలు వైకాపా పట్ల తీవ్ర అసంతృప్తిలో ఉన్నారన్నారు. వైకాపా పాలనలో రాష్టం అప్పులు, అవినీతి, ఆరాచకం, గంజాయ్, డ్రగ్ ఆంధ్రప్రదేశ్ గా మారిపోయిందన్నారు. రాష్టంలో ల్యాండ్, సాండ్, వైన్, మైన్, ఎర్రచందనం, ఎర్రమట్టి, మాఫియాల రాజ్యం ఏలుతుందన్నారు. జగన్ కు ఓటమి ఫోభియా పట్టుకుందన్నారు. జగన్ సభలు వెలవెలలాడుతున్నాయన్నారు.రాష్టంలో కాంగ్రెస్ పార్టీకి అరణ్య వాసం ముగిసిందని, గత వైభవం తిరిగి ప్రారంభమైనదన్నారు. మొన్న కర్ణాటకలో కాంగ్రెస్, నిన్న తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని రేపు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారన్నారు. రాహుల్ గాంధీ ని ప్రధాని చేయడమే స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ఆశయం అని ఈ ఆశయ సాధన కోసం అందరం కలిసి కట్టుగా కృషి చేద్దామని అందుకోసం కాంగ్రెస్ పార్టీలోకి స్వగృహ ప్రవేశం చేయాలని వైకాపా శ్రేణులకు తులసి రెడ్డి పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు బరగొడ్ల హుస్సేన్ బాష, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి శంసుల్ హాక్, ఆళ్లగడ్డ మండల అధ్యక్షులు నజీర్ బాష, నంద్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గంధం మల్లేశ్వర్ రెడ్డి, పాపాజి, సిరివెళ్ల మండల అధ్యక్షులు పసుపులేటి లక్ష్మి నరసింహుడు, నంద్యాల జిల్లా సోషల్ మీడియా కో ఆర్డినేటర్ సంజీవ కుమార్, మహబూబ్ బాష తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img