Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ

విశాలాంధ్ర – నందిగామ రూరల్ : అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న సేవా మార్గంలోనే తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు కేశినేని శివనాద్ (చిన్ని) అన్నారు మంగళవారం నందిగామ పట్టణ శివారు ఆర్ఎస్ గార్డెన్ నందు నందిగామ నియోజకవర్గ టిడిపి జనసేన ఉమ్మడి అభ్యర్థి తంగిరాల సౌమ్య, ఉత్తర అమెరికా తానా ఫౌండేషన్ సభ్యులతో కలిసి వంద మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా తంగిరాల సౌమ్య మాట్లాడుతూ ఇంతటి మహత్కార కార్యక్రమానికి చేయూత నిచ్చిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం వారికి తానా ఫౌండేషన్ ట్రస్ట్ పుట్టగుంట సురేష్ కి, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు కేశినేని శివనాథ్ కి తంగిరాల సౌమ్య ప్రత్యేక అభినందనలు తెలిపారు ఈ ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ ద్వారా మహిళమణుల ఆనందాలకు అవధులు లేవనీ అన్నారు చంద్రబాబునాయుడు అధికారంలోకి వస్తేనే రాష్టాభివృద్ధి సాధ్యం అవుతుందని,గంజాయి స్మగ్లింగ్‌, మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాల్లో జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏపీని దేశంలోనే నంబర్‌వన్‌ స్థానంలో నిలబెట్టారనీ ఎద్దేవా చేశారు,వైసీపీ పాలనలో మహిళల మాన, ప్రాణాలకు రక్షణ కరువైందనీ,ఏపీలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక రాష్ట్ర యువత పక్క రాష్ట్రాలకు వలసలు వెళుతున్నారు,వైసీపీ పాలనలో యువత గంజాయి, మత్తు పదార్థాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారనీ, మహాశక్తి పథకంలో భాగంగా రాష్ట్రంలోని మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు,ఆడబిడ్డ నిధి 18 ఏళ్లు దాటిన మహిళలందరికీ నెలకు రూ.1500లు,‘తల్లికి వంద నం’ పేరుతో ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుతుంటే అంత మందికీ ఏడాదికి రూ.15 వేల రూపాయలు అందిస్తామని,దీపం’ పేరుతో ప్రతి ఇంటికీ ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్‌ సిలిండర్లు అందజేయడం జరుగుతుందనీ ఆమె పేర్కొన్నారు కేశినేని శివనాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో మరో రెండు నెలల్లో అధికారంలోకి తెలుగుదేశం పార్టీ వస్తుందని రాష్ట్ర అభివృద్ధి ఒక చంద్రబాబు తోనే సాధ్యమని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని, పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఎంతో సుదీర్ఘంగా ఆలోచించి ఇటీవల ప్రకటించిన 99 సీట్లలో గెలుపు గుర్రాలు 100% ఉన్నారని స్థానిక జనసేన టిడిపి ఉమ్మడి అభ్యర్థి తంగిరాల సౌమ్య భారీ మెజార్టీతో గెలవడం తధ్యమని అన్నారు స్థానిక ఎమ్మెల్సీ గాని, ఎమ్మెల్యే గాని, రాష్ట్ర ముఖ్యమంత్రి గానీ ఏ రోజైనా పేద ప్రజలకు తమ సొంత నిధులతో ఏదైనా చేశారా అని ప్రశ్నించారు ప్రభుత్వ ధనంతో ప్రజల సొమ్ముతో తమ జేబుల్లో డబ్బులు ఇస్తున్న మాదిరిగా గొప్పలు పోతూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక తెదేపా నాయకులు, కార్యకర్తలు జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు అనంతరం స్థానిక జనసేన కార్యాలయంలో జనసేన నియోజకవర్గ కన్వీనర్ తంబళ్లపల్లి రమాదేవిని మర్యాదపూర్వకంగా కలిశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img