విశాలాంధ్ర, జియమ్మవలస: మండలంలోని బట్లభద్ర గ్రామంలో ఒకే కుటుంబంలో మరణించిన తల్లికూతుల్ల మృతికి కారణమైన ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని సిపిఐ, ఏఐటియుసి నాయకులు డిమాండ్ చేశారు. సోమవారంనాడు బట్లభద్ర గ్రామంలో మేరువ పరమ దామేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించారు. 12 గంటల వ్యవధిలో తల్లి,కుమార్తె మరణించడం దారుణమన్నారు. దీనికి కారణమైన ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యులుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో సీపీఐ పార్వతిపురం మన్యంజిల్లా కార్యదర్శి కె. మన్మధరావు, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి ఆర్ వి ఎస్ కుమార్ నాయకులు సూరన్న, కె.గోపి, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఈనెల 28న విజయవాడలో జరగనున్న భూబాధితుల రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని సిపిఐ కార్యదర్శి మన్మధరావు తెలిపారు. దీనికి సంబంధించి గోడపత్రికలను విడుదల చేశారు.