టీ20 ప్రపంచకప్కు అర్హత సాధించిన పసికూన
న్యూదిల్లీ: టీ20 క్రికెట్లో పసికూన పపువా న్యూ గినియా జట్టు సంచలనం సృష్టించింది. వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ పోటీలకు క్వాలిఫై అయింది. దాంతో, వరల్డ్ కప్ బరిలో నిలిచిన 15వ జట్టు అయింది. తూర్పు ఆసియా పసిఫిక్ క్వాలిఫైయర్ పోటీలో పపువా న్యూ గినియా శుక్రవారం ఫిలీప్పీన్స్ జట్టుపై 100 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన గినియా టీమ్ 229 రన్స్ కొట్టింది. టీ20ల్లో ఆ జట్టుకు ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. ఆ తర్వాత ఫిలీప్పీన్స్ను 127 పరుగులకే కట్టడి చేసింది. న్యూ గినియా బౌలర్ కబువా మొరియా హ్యాట్రిక్తో సహా 5 వికెట్లతో చెలరేగాడు. దాంతో, ఆతిథ్య జట్టు 100 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. గురువారం స్కాట్లాండ్` ఐర్లాండ్ జట్లు పొట్టి ప్రపంచ కప్ పోటీలకు క్వాలిఫై అయ్యా యి. యూరోపియన్ క్వాలిఫైయర్స్లో మెరుగైన రన్రేటు ఉన్న ఈ రెండు జట్లు నేరుగా అర్హత సాధించాయి. ఇప్పటికే అన్ని ప్రధాన జట్లు ఈ పోటీలకు క్వాలిఫై అయ్యాయి. వచ్చే ఏడాది జూన్లో టీ20 ప్రపంచ కప్ మొదలవ్వనుంది. ఈ మెగా టోర్నీకి వెస్టిండీస్, అమెరికా సంయు క్తంగా ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే.