విశాలాంధ్ర,ఎన్ పి కుంట: మండల పరిధిలోని గూటిబైలు పంచాయతీలోని దిగువ గూటిబైలు గంగమ్మ గుడికి గురువారం బిజెపి రాష్ట్ర మైనార్టీ మోర్చా కార్యవర్గ సభ్యులు షేక్ బాబ్జాన్ మైక్ సెట్ ను విరాళం అందించారు. ఈ సందర్భంగా బాబ్జాన్ మాట్లాడుతూ దిగువ గూటిబైలు కు చెందిన గ్రామస్తులు తమ గ్రామంలోని గంగమ్మ గుడికి మైక్ సెట్ అందించాలని కోరగా వెంటనే అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి ఆలయానికి మైక్ సెట్ వితరణ చేయడం జరిగిందన్నారు. గత కొద్ది రోజులుగా గుడిలో మైక్ లేక పండుగలకు, వారాలకు భజనలు చేసుకోవడానికి మైక్ లేక ఇబ్బంది పడుతున్నామని గ్రామస్థులు అడగగా వారి కోరిక మేరకు సేవా భావంతో తన వంతుగా గుడికి మైక్ సెట్ విరాళంగా అందజేశానన్నారు.అందులో భాగంగా గ్రామానికి విచ్చేసిన బాబ్జాన్ కు గ్రామస్థులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో బిజేపి సమాచార చట్ట హక్కు జిల్లా కన్వీనర్ జయరాములు ,వెంకట రమణ, మైనారిటీ మండల అధ్యక్షులు షేక్ చాంద్ భాష,గ్రామస్థులు పాల్గొన్నారు.