విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని బీసీ హాస్టల్లో రేవలేషనరీ సోషలిస్ట్ పార్టీ 84వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పి ఎస్ యు ప్రగతిశీల విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మంజుల నరేంద్ర కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెచ్చిన సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రపంచంలో ఏ దేశంలో లేనన్ని కులాలు, మతాలు భారతదేశంలోనే ఉన్నాయని, ఇలాంటి దేశంలో బిజెపి, ఆర్ఎస్ఎస్ లాంటి మతోన్మాద పార్టీలు దేశంలో ప్రజల యొక్క ఐక్యతను దెబ్బతీసే విధంగా ఉన్నాయని తెలిపారు. అంతేకాక దేశంలో ప్రజల ఐక్యతను దెబ్బతీసే విధంగా ప్రజల మధ్య చిచ్చు పెట్టడం జరుగుతుందని వారు ఆరోపించారు. ఇలాంటి తరుణంలో దేశంలో మత సామ్రాజ్యాన్ని సమగ్రతను సౌబ్రా తత్వాన్ని కాపాడుకోవాలంటే బీజేపీ ప్రభుత్వం తెచ్చిన పురసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా దేశంలో ఆర్ ఎస్పీ పార్టీ గత 55 సంవత్సరాలుగా పార్లమెంటులో ప్రాతినిధ్య వహిస్తూ ప్రజల సమస్యలపై పోరాడుతోందని తెలిపారు. భవిష్యత్తులో ప్రజల సమస్యల పైన నిరుద్యోగుల సమస్యల పైన పోరాటాలలో ముందుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పి ఎస్ యు నాయకులు హరి, భరత్, భార్గవ్, గిరీష్, తదితరులు పాల్గొన్నారు.