విశాలాంధ్ర- ధర్మవరం: పదవ తరగతి విద్యార్థులకు మారిన టెస్ట్ బుక్ లో ఉన్నటువంటి కంటెంట్, పాఠాలు భవిష్యత్తులో విద్యార్థులకు ఏమాత్రం ఉపయోగ పడే విధంగా లేవని, దీనివల్ల విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు శెట్టిపి జయ చంద్రారెడ్డి తెలియజేశారు.
ఈ సందర్భంగా ధర్మవరం యుటిఎఫ్ కార్యాలయంలో స్థానిక ధర్మవరం జోన్ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం మారిన 10వ తరగతి సోషల్ టెస్ట్ బుక్ లో 258 పేజీలు ఉంటే 167 పేజీలు యూరోపియన్ చరిత్ర కు కేటాయించి,రాష్ట్ర చరిత్ర కు అత్యంత తక్కువ పేజీలు ఇవ్వడం విద్యార్థులకు ఎలా ఉపయోగమో చెప్పాలని కోరారు. గత సంవత్సరం 9వ తరగతి హిందీ పుస్తకం చాలా ఇబ్బందికరంగా ఉందని, ఉపాధ్యాయులకు కూడా అర్థం చేసుకోలేని ఉత్తర భారతదేశం మాండలికాలు ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థులను,ఉపాద్యాయులను గందరగోళం నకు గురి చేసిందని, గతంలో అధికారుల దృష్టికి తీసుకువచ్చిన, ఈ సంవత్సరం పదవ తరగతి టెస్ట్ బుక్ అదే పద్ధతిలో ముద్రించటం విద్యార్థులకు హిందీ భాష పట్ల ఆసక్తిని తగ్గించే ప్రక్రియ ను చేపట్టారనే అనుమానాన్ని వ్యక్తపరిచారు. భౌతిక శాస్త్రం లో మూలకాల వర్గీకరణ, పరమాణు నిర్మాణం, రసాయన బంధం లాంటి పాఠాలు తొలగించి వేయటం అత్యంత దారుణమని విమర్శించారు. పిల్లలకి శాస్త్రీయమైన దృక్పథాన్ని అలవర్చే పాఠ్యాంశాలను తీసివేయడం సరికాదన్నారు.. గణిత సబ్జెక్టులో భవిష్యత్ పోటీ పరీక్షలకు సిద్ధపడే విద్యార్థులకు ఉపయోగపడే విధంగా లేవని తెలిపారు. ఇప్పటికైనా పాత పాఠ్యాంశాలను తిరిగి చేర్చాలని, పిల్లల్లో సృజనాత్మకత ,శాస్త్రీయ దృక్పథాన్ని పెంపుదల కోసం ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించే పాఠ్యంశాలను తొలగించడం సరికాదని తెలియజేశారు. గత ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలు కారణంగా ప్రాథమిక పాఠశాల వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైనదని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి జీవో 117 ను రద్దు చేయడం, సమాంతర మీడియాలను కొనసాగించడం ,ప్రాథమిక పాఠశాల అంటే ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు కొనసాగుతాయి అని, తక్షణ నిర్ణయాలు తీసుకోవాలని, నూతన ప్రభుత్వమును డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ధర్మవరం జోన్ యుటిఎఫ్ నాయకులు రామకృష్ణనాయక్, ఆంజనేయులు, లక్ష్మయ్య, అమర్ నారాయణరెడ్డి, రాంప్రసాద్, హరికృష్ణ,సాయి గణేష్, రామాంజనేయులు, ఆదిశేషు, జనార్ధన్ బాబు, వెంకట కిషోర్, తదితరులు పాల్గొన్నారు..