భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు గంటపార రంగనాయకులు.
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణములోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి గుడి మాన్యం ద్వారా భావన నిర్మాణ కార్మికుల కొరకు 840 ప్లాట్లను కార్మికుల కోసం వేయడం జరిగిందని ఇందులో 700 ప్లాట్ లను లక్కీ ట్రిప్ ద్వారా భవన కార్మికులకు అందజేయడం జరిగిందని, దీంతో అధికంగా డబ్బులు ముఖ్య నాయకులు వసూలు చేయడం దారుణమని భావన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షులు గంటపార రంగనాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం 140 ప్లాట్లను ఇప్పుడు కూడా ముఖ్య నాయకుల చేతిలో ఉన్నాయని, ప్లాట్ రిజిస్ట్రేషన్ కొరకు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని వారు వాపోయారు. గతంలో కార్మికులకు ఇచ్చిన ప్లాట్లను వారి అవసరము కొరకు అమ్ముకోగా నేడు ప్లాట్లను కొన్న వారితో కూడా రిజిస్ట్రేషన్ ఖర్చులు కొరకు డబ్బులు వసూలు చేయడం దారుణం కాదా అని వారు ప్రశ్నించారు. కావున సంబంధిత అధికారులు వీటిపై విచారణ జరిపి భవన కార్మికుల కు న్యాయం చేయాలని వారు తెలిపారు.