స్వయంభు వరసిద్ధి వినాయక ఆలయ కమిటీ
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని యాదవ వీధిలో గల స్వయంభు వరసిద్ధి వినాయక గుడి పునర్నిర్మాణమునకు దాతల సహాయ సహకారం ఎంతో అవసరమని ఆలయ కమిటీ అధ్యక్షులు మాల గుండ్ల మల్లికార్జున, కార్యదర్శి రమణారెడ్డి, కోశాధికారి పిన్ను సురేష్ బాబు ,ఉపాధ్యక్షులు కోటి వెంకటేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో గుడి రెండున్నర సెంట్లు స్థలములో ఉండేదని, స్థల ప్రభావం తక్కువగా ఉన్నందున 10 సెంట్లు అక్కడే కొనుగోలు చేయడం జరిగిందన్నారు. 350 మంది ప్రస్తుతం దాతల సహాయ సహకారంతో గుడి నిర్మాణపరులు జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటికీ ఒక కోటి 60 లక్షల రూపాయలు వివిధ దాతల ద్వారా ఆలయానికి అందడం జరిగిందన్న రు. గుడికి అదనపు స్థలము కొరకు 80 లక్షలు ఖర్చు చేయడం జరిగిందన్నారు. మూడు కోట్ల రూపాయలతో అత్యంత వైభవంగా భక్తాదులు కోరిక మేరకు నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతుందని తెలిపారు. దాతలు మరింత సహాయ సహకారాలు అందిస్తే, ఒక సంవత్సరము లోపు ఆలయాన్ని పూర్తిగా నిర్మాణం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ నెలలో 20 మంది దాతలు రూ.25,116 లు చొప్పున ఆలయానికి చెక్కు/నగదు రూపేనా అందించడం జరిగిందన్నారు. ఈ గుడి నిర్మాణం దాదాపుగా ఒకటిన్నర సంవత్సరం నుంచి జరుగుతోందని వారు తెలిపారు. ఈ గుడికి నిర్మాణ దాతలుగా ధర్మవరం పట్టణవాసులే దాతలుగా వచ్చి, సహాయ సహకారాలు అందించడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కావున గుడి నిర్మాణంలో ఇంకను డబ్బు కావాల్సి ఉందని, ఆసక్తి గల దాతలు గుడి నిర్మాణానికి సహాయ సహకారాలు అందించాలని వారు కోరారు.