డిపో మేనేజర్ సత్యనారాయణ
ధర్మవరం:: ఆర్టీసీ ఆదాయాన్ని అందరి కృషి ఎంతో అవసరమని డిపో మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతినెలా ధర్మవరం ఆర్టీసీ డిపోలో అత్యధిక డీజిల్ ను డ్రైవర్లు ఆదా చేస్తూ, డిపో అభివృద్ధికి తోడ్పడటం నిజంగా గర్వించదగ్గ విషయమని వారు తెలిపారు. గత మే నెలలో అత్యధిక డివిజన్ ను ఆదా చేసిన డ్రైవర్లలో ఎం.నారాయణ 95 లీటర్లు ఆదా, కేఎంపిఎల్ 5.68, రెండవ స్థానంలో ఏ ముత్యాలప్ప ఆధా చేసిన డీజిల్ 70 లీటర్లు, కే ఎం పి ఎల్ 5.51, ఉదయ ఫేస్లో ఏ. ఏ. నారాయణ, ఆధార్ చేసిన డీజిల్ 64 లీటర్లు. ఏ ఎం పి ఎల్ 5.84 కలదని తెలిపారు. ఈ డ్రైవర్లను అందరూ ఆదర్శంగా తీసుకొని అధికంగా తీసుకొని రావాలని, ఆర్టీసీ ఆదాయానికి,అభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. తదుపరి ఈ ముగ్గురిని వారు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా ప్రయాణికులను సురక్షితంగా చేర్చాలని, సంజీవపురం క్రాస్, గుట్టురు క్రా స్, పొట్ల మర్రి క్రాస్, పెడపల్లి క్రాస్, మందలపల్లి క్రాస్, కప్పల బండ క్రాస్, తగరకుంట క్రాస్, అదేవిధంగా అనంతపురం, పుట్టపర్తి, కర్నూల్,నంద్యాల, హిందూపురం వెళ్లే మార్గమధ్యంలో వచ్చే క్ర్ర సుల వద్ద డ్రైవర్లు అతి జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని తెలిపారు. ప్రతి డైవరు మద్యపానం సేవించకుండా ఉండాలని, ఆర్టీసీ నియమ నిబంధనలు పాటించాలని తెలిపారు. ఆర్టీసీ డిపో ఆదాయానికి,అభివృద్ధికి కిందిస్థాయి నుంచి పై స్థాయి అధికారుల వరకు అందరూ బాధ్యులే అని తెలిపారు. డ్రైవర్ల సమస్యలు ఏవైనా ఉన్నాయెడల నా దృష్టికి తీసుకొని రావాలని, తద్వారా పరిష్కరించే దిశగా తాను కృషి చేస్తానని తెలిపారు. ప్రతి బస్సు డ్రైవరు సమయపాలన పాటించాలని, అప్పుడే ప్రయాణికులకు ఆర్టీసీ మీద పూర్తి నమ్మకం కలుగుతుందని తెలిపారు.