విశాలాంధ్ర ధర్మవరం:: విద్యార్థులు ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్. పుష్పలత పేర్కొన్నారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని గోట్లురు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నేషనల్ అయోడిన్ డిజార్డర్ కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక పాఠశాలలో గల పిల్లలకు అయోడిన్ లోపం వల్ల కలిగే వాటిపై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం డాక్టర్ పుష్పలత, డాక్టర్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ అల సట, బలహీనత, బరువు పెరగడం అసహనం లాంటి సమస్యలు వస్తాయని వారు తెలియజేశారు. అయోడిన్ ఉప్పు ప్రతి ఇంటిలోనూ వాడాలని, వాడితే కలుగు లాభాలను కూడా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం భాస్కర్ రెడ్డి, సిహెచ్ఓ కళావతి, హెల్త్ సూపర్వైజర్ రాజశేఖర్ రెడ్డి, ఏఎన్ఎం నీరజాక్షి, శ్యామల, ఎంఎల్ హెచ్పి అఖిల, అశ్విని, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.