విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణములో ఈనెల 11వ తేదీ నుంచి రంజాన్ మాసము ప్రారంభోత్సవం కావడంతో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి వేర్వేరు ప్రకటనలో రంజాన్ శుభాకాంక్షలు ప్రజలకు తెలియజేశారు. అంతేకాకుండా ఆయా పార్టీల నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు శ్రేయోభిలాషులకు కూడా రంజాన్ మాస శుభాకాంక్షలు అని తెలియజేశారు. అనంతరం మాట్లాడుతూ ముస్లిములకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభం కావడం శుభదాయకమన్నారు. అత్యంత నియమ నిష్ఠలతో ఉపవాస దీక్షలో ఆచరించబోతున్న ప్రతి ఒక్కరికి అల్లా దయతో అంతా మంచి జరగాలని వారు తెలిపారు. ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం అందరికీ శుభదాయకం కావాలని తెలిపారు.