విశాలాంధ్ర ధర్మవరం: రాష్ట్రములోని రైతులకు ఆరోగ్యమైన పశువులతో మెరుగైన లాభాలు పొందడానికి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా లంపీ స్కిన్ వ్యాక్సినేషన్ చేపట్టడం జరిగింది అని మండల పశు వైద్యాధికారి శేఖర్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇందులో భాగంగా ధర్మవరం మండల పరిధిలోని తిప్పేపల్లి గ్రామంలో శర్మ ముద్దా వ్యాధి(లంపి స్కిన్) నివారణకు వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది అని, సాధారణంగా చర్మముద్ధ వ్యాధి పశువులలో వాతావరణంలో మార్పులు ఏర్పడి చల్లని వాతావరణ సమయంలో ఎక్కువగా పశువులకు చర్మంపై బొబ్బలు వచ్చి ప్రాణాంతకంగా మారుతుంది అని తెలిపారు.దీనితో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. దీని నివారణకు గోట్ ఫాక్స్ వ్యాక్సిన్ మందును పశువులకు వేయడం జరిగింది అని తెలిపారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం గోపాలమిత్రలు ఈశ్వరయ్య, శ్రీరాములు, కాటమయ్య తదితరులు సోకే శర్మ ముద్దా వ్యాధి నివారణకు వ్యాక్సిన్ వేయడం జరిగిందన్నారు. గ్రామంలో దాదాపు 100 పశువులకు వ్యాక్సిన్ వేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కాయల అంజనప్ప, బర్ర శ్రీరాములు, గుంటకల పురుషోత్తం, వేముల కళ్యాణ్ రెడ్డి, దాడి తోట కిరణ్, మందల శ్రీనివాసులు, పిక్కిరి నారాయణస్వామి, బర్ర సుధాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు.