విశాలాంధ్ర,సీతానగరం: అన్ని వర్గాల కుటుంబ సభ్యుల అవసరాలను గుర్తించి వారికి జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా మేలు చేకూర్చడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ఎంపిడిఓ ఎం ఎల్ ఎన్ ప్రసాద్ తెలిపారు.శుక్రవారం వెంకటపురం గ్రామసచివాలయంలలోజరిగిన జగనన్న సురక్ష క్యాంపు కార్యక్రమము జరిగింది.జగనన్న సురక్ష క్యాంప్ ద్వారా అర్జీ పెట్టుకున్న అర్హులకు మంజూరు కాబడిన 11రకాల సేవలకు చెందిన దృవీకరణ పత్రాలను ఎంపిపి, జెడ్పీటీసీ , పార్టీ అధ్యక్షుడు, సర్పంచుల చేతుల మీదుగా ఆర్జీదారులకు అందజేసారు.కులధృవీకరణ,ఆదాయ,జనన, కుటుంబ , మరణ ధృవీకరణ, కొత్త రైస్ కార్డులు, వివాహా ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఈకార్యక్రమంలో జగనన్న సురక్ష కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశంను ప్రజలకుఎంపిడిఓ ఎం ఎల్ ఎన్ ప్రసాదు, ఈఓపిఆర్డీలు తెలిపారు.ఈకార్యక్రమంలో జడ్పీటీసీ మామిడి బాబ్జీ, ఎంపీపీ ప్రతినిధి బలగ శ్రీరాములు నాయుడు, పార్టీ అధ్యక్షులు బొంగు చిట్టిరాజు, సర్పంచులు బుడితి శ్రీనివాసరావు, వాకాడ పారమ్మ, ఎంపిటిసి గుల్ల సంతోషికుమారి,ఆర్ ఐ శ్రీనివాసరావు,హౌసింగ్ ఏఈ జానకీరాం, వెలుగు ఏపిఎం శ్రీరాములు, ఉపాధి ఏపిఓ భాను,నాయకులు దాసరి నాగరత్నం,బుడితి గౌరునాయుడు, ఏగిరెడ్డి గోపాలనాయుడు,ముకుంద, కె. లలిత,సెక్రటరీలు వెంకటలక్ష్మీ, పీటర్, విఆర్ఓ సుబ్రమణ్యం ,సచివాలయం ఉద్యోగులు, అంగన్వాడి సిబ్బంది, వైద్య సిబ్బంది,నాలుగుపంచాయతీల వాలంటీర్లు, సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు, స్థానిక ప్రజలు, లబ్దిదారులు పాల్గొన్నారు.