విశాలాంధ్ర, సీతానగరం: మండలంలోని పలువురు మండల, గ్రామ అధికారులు శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా ప్రశంసా పత్రాలను జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ చేతుల మీదుగా స్వీకరించారు. జిల్లా కేంద్రంలో జరిగిన వేడుకల్లో ఎంపిడిఓ ఎం ఎల్ ఎన్ ప్రసాద్, హౌసింగ్ ఏఈ జానకీ రామ్, చినభోగిలి వి ఆర్ ఓ ఎస్ లక్ష్మి,సీతానగరం పి హెచ్ సి సీనియర్ అసిస్టెంట్ యు. మురళీ,104 డిఈఓ
సిహెచ్ ప్రసాదరావు, పోలీస్ స్టేషన్లో హెచ్సి జి.రామకృష్ణ, బూర్ణ సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ బి.రోహిణీ, జోగమ్మపేట ఎస్సీ గురుకుల పాఠశాల జూనియర్ అసిస్టెంట్ అశోక్ లు ప్రశంసా పత్రాలను పొందారు. వారిని మండలంలోని ప్రజా ప్రతినిదులు,అధికారులు,ఉద్యోగులు అభినందించారు.మండలానికి చెందిన పిడి డిటి.గాంధీ, ఏజిపి బొంగు సత్యనారాయణలు కూడా ఉత్తమ ప్రశంసా పత్రాలను పొందారు.