బుధవారం స్థానిక ఫంక్షన్ హాల్ లో జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి పొగిరి సురేష్ బాబు అద్యక్షతన నిర్వహించిన జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు మురళీమోహన్, ఈ సమావేశంలో కోండ్రు మాట్లాడుతూ తెదేపా జనసేన కూటమితో తాడేపల్లి ప్యాలస్ లో కలవరం మొదలైందన్నారు, తెలుగుదేశం జనసేన పార్టీల పొత్తుకు రాష్ట్ర ప్రజల ఆమోదం ఉందన్నారు, తెదేపా – జనసేన పొత్తుతో రాష్ట్రంలో ప్రకంపలను సృష్టించనుందన్నారు. చంద్రబాబును 53 రోజులు అక్రమ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇరికించి నిరూపించలేక పోయారు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రాజాం కు నాలుగు లైన్ల రోడ్డు, రింగ్ రోడ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, పీజీ సెంటర్ ఇల్లు లేని పేదలకు టిడ్కో ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు, ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి పొగిరి సురేష్ బాబు, అర్జున్ భూపతి, ఉర్లాపు పోలిరాజు, గొర్ల గోవిందరావు, మీసాల రవి, అనుదీప్, తాటి శ్రీనివాసరావు, కడగల రాము, శ్యామసుందర్రావు, రామకృష్ణ, డబ్బాది కృష్ణ తదితర జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు, తెలుగుదేశం పార్టీ రాజాం టౌన్ అధ్యక్షులు నంది సూర్య ప్రకాశరావు, దుప్పల పూడి శ్రీను, గురవాన నారాయణరావు, కిమిడి అశోక్ కుమార్, దూబ ధర్మారావు, టంకాల కన్నం నాయుడు, కర్నేన మహేష్ తదితర నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు…