విశాలాంధ్ర,సీతానగరం: ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుదవారంనాడు బూర్జ ఆయుర్వేద వైద్య కేంద్రం ఆవరణలో యోగాకార్యక్రమాలని ఘనంగ నిర్వహించామని ఆయుష్ వైద్యులు తెర్లి హేమాక్షి చెప్పారు.తాను జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా కార్యక్రమంలో పాల్గొనగా బూర్జలో డాక్టరు ప్రసన్న కుమార్, యోగా ఇన్స్ట్రక్టర్ రూప ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు.నేటి ఆధునిక కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో యోగా ఆవశ్యకతను వివరించారు. మానసిక ఒత్తిడిని తగ్గించే విధంగా యోగా పనిచేస్తుందని తెలిపారు. సీతానగరం, పెదఅంకలం ప్రాధమిక ఆరోగ్యకేంద్రాల వద్ద వైద్యులు శిరీష,ఉషారాణి, రాధాకాంత్ సిబ్బంది పాల్గొని యోగాను నిర్వహించారు. సచివాలయంలలో వైద్య సిబ్బంది ఆద్వర్యంలో నిర్వహించారు.