విశాలాంధ్ర- వలేటివారిపాలెం : మండలంలో వచ్చేనెల (జులై )1వ తేదీ నుండి 25 వరకు జరగనున్న జగనన్న సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండలమీడియా అధికార ప్రతినిధి పరిటాల వీరాస్వామి మండల జేసీఎస్ కన్వీనర్ అనుమోలు వెంకటేశ్వర్లు కోరారు.మంగళవారం విశాలాంధ్ర విలేకరితో వారు మాట్లాడుతూ మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సర్పంచ్ లు, ఎంపీటీసీ సభ్యులు,సచివాలయ కన్వీనర్లు,గృహసారధులు, వలంటీర్లు జగనన్న సురక్ష కార్యక్రమాన్ని బాధ్యతగా ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని తెలిపారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జగనన్న సురక్ష కార్యక్రమాన్ని మన శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి చూచనమేరకు మన మండలంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం అయ్యేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. అన్ని గ్రామాలలో వలంటీర్లతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి వారికి అవసరమైన ధ్రువపత్రాలు మంజూరు కొరకై సచివాలయాలలో నమోదు చేయించవలచిందిగా కోరారు.
1.కులదృవీకరణ పత్రం
2.ఆదాయ ధ్రువీకరణ పత్రం
- జనన ధ్రువీకరణ పత్రం
4.మరణ ధ్రువీకరణ పత్రం
5.భూములకు చెందిన మ్యూటేషన్ మరియు పట్టాదారుల పాసుపుస్తకాల కొరకు దరఖాస్తు.
6.వివాహ ధ్రువీకరణ పత్రం
7.ప్యామిలీ మెంబర్స్ ధ్రువీకరణ పత్రం
8.ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ లింక్ చేయుట
9.కౌలు రైతు పత్రాలు.
10.రైస్ కార్డు నుండి ఇతరులను తొలగించుకునే అవకాశం
11.హౌస్ ఓల్డ్ మ్యాపింగ్ నుండి ఇతరులను తొలగించడం లేదా చేర్చుకొనుట.
పైన తెలిపిన 11సేవలను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా సత్వర పరిస్కారం అందరికి అందేవిధంగా చూడన్నదే జగనన్న సురక్ష పధక ఉద్దేశ్య మని తెలిపారు. ప్రతి ఇంటికి వెళ్లి కార్యక్రమం యొక్క వివరాలను వారికి తెలియజేసి వారికి కావాల్చిన ధ్రువీకరణ పత్రాలు అందించే విధంగా చూడాలని అన్నారు. మండలంలో ప్రతి సచివాలయానికి నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం వచ్చిన అధికారులకు సంబందించిన ధ్రువీకరణ పత్రాలను అందజేయాలని అన్నారు