ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ నజీర్
విశాలాంధ్ర – ధర్మవరం : ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి శుక్రవారం సదరం క్యాంపును నిర్వహించడం జరుగుతుందని, ఈ క్యాంపును ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ నజీర్ పేర్కొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం సదరం క్యాంపు కార్యక్రమములో ఎముకుల వైద్య నిపుణులు డాక్టర్ యు. పద్మజ రోగులకు పరీక్షలు నిర్వహించారు.. మొత్తం 12 మంది రోగులు హాజరుకాగా చెవి, కంటి, మానసిక రోగం గల ముగ్గురిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేయడం జరిగిందన్నారు. మిగిలిన 9 మందికి శరీరంలో గల లోపం యొక్క శాతమును మరో 10 రోజులలో ఆయా సచివాలయాల్లో సదరం సర్టిఫికెట్లు అందజేస్తారని తెలిపారు. సదరం సర్టిఫికెట్ కావలసినవారు ఆయా సచివాలయాల్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ లావణ్య పాల్గొన్నారు.