Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

ప్రజా సమస్యల పరిష్కారం కోసమే జగనన్న సురక్ష

విశాలాంధ్ర – కొయ్యలగూడెం : గ్రామాలలో ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించడం కోసం ముఖ్యమంత్రి జగన్ జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టడం జరిగిందని తాసిల్దార్ పి. నాగమణి పేర్కొన్నారు. మండలంలో అచ్యుతాపురం గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని సోమవారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజల వద్దకే పాలన అనే విధంగా అధికారులంతా తమ గ్రామాలకు వచ్చి తమ సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసే జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. గ్రామంలోని పలువురు దరఖాస్తు చేసుకున్న కుల, ఆదాయ, నివాస, పత్రాలను, అర్హులైన వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా గ్రామంలో ఉన్న చెరువు చుట్టూ వివిధ రకాల మొక్కలను నాటడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీవో బేబీ శ్రీలక్ష్మి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చెట్లను పెంచాలని చెట్లను పెంచడం ద్వారా అవి మనకు మంచి ఆక్సిజన్ ఇస్తాయని మానవుని మనుగడకు గాలి ఎంతో అవసరం అని అందుచేత ప్రతి ఒక్కరూ చెట్లను పెంచాలని, చెట్లను పెంచడం వలన వర్షాలు కూడా సమృద్ధిగా కురుస్తాయని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి, డీఈవో ఎన్ వి. రవి సాగర్, ఎంఈఓ జే సురేష్ బాబు, ఆర్ ఐ మణిదివ్య, విద్యుత్ శాఖ ఏఈ రామారావు, వైసిపి మండల కన్వీనర్ గొడ్డటి నాగేశ్వరరావు, మండల సచివాలయాల కన్వీనర్ నూకల రాము, గ్రామపంచాయతీ సర్పంచ్ మద్దిపాటి నాగమణి, ఎంపీటీసీ సభ్యురాలు మందపాటి కుమారి,పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ, వీఆర్వోలు, సచివాలయ సిబ్బంది, ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img