రైతు సంఘం నాయకులు మనోహర్
విశాలాంధ్ర -ఉరవకొండ : గత సంవత్సరం ఖరీఫ్ సీజన్లో అన్ని రకాల పంటలను నష్టపోయిన రైతులకు పంటల భీమా మంజూరు చేయాలని మంగళవారం నాడు జరిగిన ఆందోళనలో పాల్గొన్న రైతులపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేయడాన్ని ఏపీ రైతు సంఘం ఉరవకొండ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కురుగుంట మనోహర్ తీవ్రంగా తీవ్రంగా ఖండించారు. బుధవారం ఉరవకొండ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అన్నదాతల సమస్యలు పరిష్కరించాలని రైతులు శాంతియుతమైన ఆందోళన చేస్తే జీర్ణించుకోలేని రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమాన్ని అణచివేయాలనే ధోరణితో పోలీసుల ద్వారా అక్రమ కేసులు నమోదు చేయించడం దుర్మార్గమైన చర్య అన్నారు, ఉద్యమాన్ని అణచివేసే దానిపైన ఉన్న శ్రద్ధ సమస్యలు పరిష్కారం కోసం ప్రభుత్వం చొరవ తీసుకోకపోవడం బాధాకరమన్నారు,ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులపై నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలని, అన్ని రకాల పంటలకు భీమాను వర్తింపచేసి రైతులకు న్యాయం చేయాలని లేనిపక్షంలో భవిష్యత్తులో రైతులను మరియు కలిసి వచ్చే రాజకీయ పార్టీలతో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని మనోహర్ పేర్కొన్నారు.