విశాలాంధ్ర, పెద్దకడబూరు :మండల కేంద్రమైన పెద్దకడబూరులో డాక్టర్ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 38వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా మాజీ కార్య వర్గ సభ్యులు బొగ్గుల తిక్కన్న మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయుడు జగ్జీవన్ రామ్ అన్నారు. భారత ప్రజలకు లభించిన అమూల్యరత్నం అని కొనియాడారు. అంబేద్కర్ సాధించి పెట్టిన రిజర్వేషన్లను అమలుపరచిన ఘనత ఈయనకే దక్కుతుందన్నారు. కార్మిక శాఖ మంత్రిగా, నెహ్రూ మంత్రివర్గంలో పనిచేశారన్నారు. జగ్జీవన్ రామ్ ఆశయాలను, సేవలను స్పూర్తిగా తీసుకొని ప్రతి దళితుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలందరూ రాజకీయంగా ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మాజీ మండల అధ్యక్షులు జంబన్న, తెలుగు యువత నాయకులు బొగ్గుల సుధాకర్, ఈరన్న, బజారి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.