ఆత్మకూర్ కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నీళ్లపాళ్ల రామకృష్ణ
విశాలాంధ్ర -ఆత్మకూరు : భారత కమ్యూనిస్టు పార్టీ( సిపిఐ )రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలం లో ఆర్ డి టి స్కూల్లో విలేకరుల సమావేశం గురువారం నిర్వహించారు. కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సనప నీళ్లుపాల రామకృష్ణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బండారు శివ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈనెల. 8 న కళ్యాణదుర్గం నియోజకవర్గంలో రైతు దినోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.సంతోషమే,ఏమాత్రం రైతులకు ఇన్సూరెన్స్ రైతులకు పడలేదని బాధాకరం. చెప్పిన మాట ఏమైందని అడుగుతున్నాం. ఈ సందర్భంగా సిపిఐ ఏపీ రైతు సంఘం.ఏఐటిసి.ఏఐవైఎఫ్ ఏఐఎస్ఎఫ్. ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలోసీఎం పర్యటనను అడ్డుకుంటాం అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎక్కువగా ప్రధాన పంట.వేరుశనగ పంట పండిస్తుంటారు. ఆత్మకూరు మండల వ్యాప్తంగా అత్యధిక వేరుశనగ పంట వేస్తున్నారు,కానీపంటల బీమా మాత్రం సీనా చెట్లకు మాత్రమే ఎకరాకి 10000, రూపాయల ప్రకటించినావుఅత్యధిక వేరుసెనగా, ఇతరపంట నష్టపరిహారం ఇన్సూరెన్స్,ఎకరాకు 10000 రూపాయలు,ఈ పరిహారాన్ని ప్రభుత్వఅధికారులు పంట అంచనా వేసే టైంలో మండల స్థాయిలో ఒకే చోట కాకుండా మూడు నాలుగు చోట్ల అంచనా వేయాల్సిన అవసరం ఉంది ప్రస్తుత వాతావరణ కాలంలో ఒకే మండలంలో వర్షాలు కొన్ని చోట్ల వస్తే కొన్ని చోట్ల వచ్చేప్రసక్తే లేదు.కావున దీన్ని అధికారులు గమనించి సరైన అంచనా వేయాలి అంతేకాకుండా గడచిన 4..సంవత్సరాల నుండి నేటివరకు పశు. నష్టపరిహారం ఇంతవరకు లేదు. వర్షాల వల్ల పిడుగుపాటుల వల్ల మృతి చెందిన పశువులకు. గొర్రెలు మేకలకు. మనుషులకు జరిగిన సంఘటనలకు ప్రభుత్వం నుండి ఇంతవరకు పరిహారం అందించడంలో విఫలం. రైతు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలి. డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు ( సి2ం50) అమలు చేయాలి. పెరుగుతున్న వ్యవసాయ ఉత్పత్తుల ఖర్చుల ను దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల విత్తనాలు. ఎరువులు పురుగుల.మందులు ధరలు ఉపకరణాలను90./.శాతం సబ్సిడీతో అందించాలి.అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వ తరహాలో ఎకరాకు 10.000 రూపాయలుసాగు సహాయం అందించాలి. కవులు రైతులకు భూ యజమాని ప్రమేయం లేకుండా గుర్తింపు కార్డులు ఇవ్వాలి. వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగించే విధానాన్ని రద్దు చేయాలి.గ్రామీణ ఉపాధి పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి ఇవన్నీ కూడా ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సమస్యలు పరిష్కారం చేయాలని ముఖ్యమంత్రి కి తెలియజేస్తున్నాం.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాప్తాడు నియోజకవర్గం ఉపాధ్యక్షుడు, బి రామాంజనేయులు, ముత్యాలు, గోపాల్ నాయక్, నల్లమ్మ, వినోద్ కుమార్, ఏఐటీయూసీ, ఏఐవైఎఫ్ ఏఐఎస్ఎఫ్ తదితరులు పాల్గొన్నారు.