విశాలాంధ్ర -ఆస్పరి : ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్లను ఉచితంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జగనన్న సురక్ష పథకాన్ని ఏర్పాటు చేసిందని తాసిల్దార్ కుమారస్వామి, ఎంపీడీవో రాణేమ్మ, సొసైటీ చైర్మన్ కట్టెల గోవర్ధన్, వైకాపా మండల కన్వీనర్ పెద్దయ్యలు అన్నారు. గురువారం మండల పరిధిలోని బిల్లేకల్లు సచివాలయంలో సర్పంచ్ శ్రీనివాసులు అధ్యక్షతన, ములుగుందం సచివాలయం-2 లో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాన్య పేద ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమాలు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. అన్ని అర్హతలు ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని వారికి జగనన్న సురక్ష వరం లాంటిది అన్నారు. అనంతరం అర్హులైన వారికి సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ములుగుందం ఎంపీటీసీ-1 వీనారెడ్డి, బిల్లేకల్లు ఎంపీటీసీ సుంకులమ్మ, ఈవోఆర్డి నరసింహారెడ్డి, జెసిఎస్ మండల కన్వీనర్ బసవరాజు, సొసైటీ సీఈఓ అశోక్, వైకాపా మండల నాయకులు ప్రభాకర్ రెడ్డి, తిమ్మప్ప, ప్రకాష్, హనుమంత్ రెడ్డి, నాగరాజు, శివమూర్తి, చంద్ర, సొసైటీ మాజీ డైరెక్టర్ బత్తిన జీవన్ కుమార్, అంజినయ్య, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.