జెడ్పిటీసీ ఇంటూరి భారతి
విశాలాంధ్ర – వలేటివారిపాలెం : నాలుగేళ్ళ వైసీపీ పాలనలో సీఎం జగన్ పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు మంజూరు చేశారని…ప్రస్తుతం వివిధ రకాల ధ్రువపత్రాలు జగనన్న సురక్ష కార్యక్రమం కింద ఉచితంగా అందజేస్తున్నారని జెడ్పిటీసీ ఇంటూరి భారతి తెలిపారు. గురువారం మండలంలోని కళవల్ల మరియు నలదలపూరు సచివాలయాలలో ఎంపీడీఓ రఫిక్ అహ్మద్ మరియు తహసీల్దార్ సుందరమ్మ అధ్యక్షతన జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. అర్హత ఉండీ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకపోతే అలాంటి వారికి జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా లబ్ధి చేకూర్చాలని సచివాల సిబ్బందికి సూచించారు.
జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా గడప వద్దకే వచ్చి ఎలాంటి సర్వీస్ ఛార్జీలు లేకుండా అవసరమైన సర్టిఫికెట్లను(జనన, మరణ, కుల, ఆదాయ మొదలైన 11 రకాలు) అక్కడే అందిస్తున్నారన్నారు.
జగనన్న సురక్ష క్యాంప్ లో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించి సకాలంలో ప్రజలకు సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం లబ్దిదారులకు ధ్రువపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పొనుగోటి మౌనిక,వైసీపీ మీడియా అధికార ప్రతినిధి పరిటాల వీరాస్వామి, వైసీపీమండల కన్వీనర్ అనుమోలు వెంకటేశ్వర్లు,వైసీపీ నాయకులు ఇంటూరి హరిబాబు,సర్పంచ్ దువ్వూరి కృపమ్మ,ఉన్నం వెంకటేశ్వర్లు, స్వర్ణ మాలకొండయ్య, మండలనాయకులు, సచివాలయకన్వీనర్లు, గృహసారధులు, వలంటీర్లు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.