విశాలాంధ్ర – ధర్మవరం : మాజీ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర నాయకులు గోనుగుంట్ల సూర్యనారాయణ జన్మదిన వేడుకలను శుక్రవారం అభిమానులు, నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున జన్మదిన వేడుకలను పట్టణ, రూరల్ అధ్యక్షులు డిష్ రాజు, అరవింద రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించుకున్నారు. తొలుత కదిరి గేటు వద్ద చేనేత విగ్రహం వద్ద కేకు కట్ చేసి గోనుగుంట్ల సూర్యనారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తదుపరి ప్రభుత్వ ఆసుపత్రి పక్కనగల అన్న క్యాంటీన్ వద్ద దాదాపు 350 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కొత్తపేట అయ్యప్ప స్వామి గుడి దగ్గర, కొత్తపేట ఎన్టీఆర్ విగ్రహం దగ్గర కూడా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.తదుపరి పట్టణ అధ్యక్షులు డిష్ రాజు ఇంటి దగ్గర కూడా మహిళలకు చీరలను పంపిణీ చేశారు. అనంతరం డిష్ రాజు అరవింద్ రెడ్డి, తుంపర్తి పరమేష్, సీనియర్ నాయకులు మాట్లాడుతూ నిత్యాన్న దాత, స్వయంకృషితో ఎదిగిన వ్యక్తి,బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గోనుగుంట్ల సూర్యనారాయణ అని తెలిపారు. గోనుగుంట్ల సూర్యనారాయణ ఎమ్మెల్యే హయాంలో నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేయడం జరిగిందని ఇప్పటికీ ప్రజల వద్దకు వెళుతూ వారి కష్టాలను తెలుసుకొని తనదైన శైలిలో సమస్యలను పరిష్కరిస్తూ ప్రజల హృదయాలలో గూడు కట్టుకున్నారని తెలిపారు. ఎంతోమంది పేద ప్రజలకు ఆర్థిక సహాయాన్ని అందించిన మహనీయుడని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిదంబరయ్య, రంగనాయుడు, మహేష్ బాబు, దుశా కృష్ణ,బి. రామకృష్ణ, సయ్యద్ బాబా, గోట్లూరు వెంకటేశు, వీరనారప్ప తదితరులు పాల్గొన్నారు.