దేశ అభివృద్ధిలో తెలంగాణ ప్రజల పాత్ర ఎంతో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన విజయ్ సంకల్ప సభలో పాల్గొన్న మోదీ.. రూ.6,100 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శుంకుస్థాపన చేశారు. 176 కి.మీ పొడవైన రెండు జాతీయ రహదారుల విస్తరణతో పాటు కాజీపేట రైల్వే వ్యాగన్ ప్యాక్టరీ యూనిట్ను వర్చువల్గా ప్రారంభించారు. అనంతరం సభలో పాల్గొన్న మోదీ.. తెలంగాణ ప్రజలందరికీ నా అభినందలు అంటూ తెలుగులో ప్రసంగం మెుదలు పెట్టారు. దేశాభివృద్ధిలో తెలుగువారి వారి ప్రతిభ కీలక మారిందని అన్నారు. ఆర్థిక వృద్ధిలోనూ తెలంగాణది ప్రధాన భూమిక అని వ్యాఖ్యనించారు.తెలంగాణ ఏర్పడిన 9 ఏళ్లలో హైవేలు, ఎక్స్ప్రెస్వేలు, ఇండస్ట్రియల్ ఎకనామిక్ కారిడార్లు ఏర్పాటు చేసుకున్నామన్నారు. అనేక ఆర్థిక కారిడార్లు పూర్తి చేసుకున్నట్లు చెప్పారు. ఇవాళ రూ. 6 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించుకోవటం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలో అనేక ముఖ్య చారిత్రక, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. తెలంగాణలో రైల్వే రహదారుల కనెక్టివిటీ పెంచుతున్నామని.. రైల్వే ఉత్పత్తుల విషయంలో రికార్డు సృష్టిస్తున్నామని అన్నారు. దేశాభివృద్ధి కోసం పనులు శరవేగంగా పూర్తి చేస్తున్నట్లు వెల్లడించిన మోదీ ప్రస్తుతం స్వర్ణయుగం కొనసాగుతుందని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని ఈ సందర్భంగా మోదీ వెల్లడించారు.