విశాలాంధ్ర-తాడిపత్రి: పట్టణంలోని శ్రీనివాసపురంలో ఉన్న శ్రీ శివ కృష్ణ సాయి వృద్ధాశ్రమంలో ఉమ్మడి గురు ప్రసాద్ రెడ్డి సేవా ట్రస్ట్ వ్యవస్థాపకుడు ఉమ్మడి గురు ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మొదటగా మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 74వ జయంతి సందర్భంగా ఉమ్మడి గురు ప్రసాద్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత ముఖ్య మంత్రి రాజశేఖర్ రెడ్డి ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయారని కొనియాడారు. ఆయన జ్ఞాపకాలు స్మృతి చేసుకుంటూ అవ్వ తాతలతో కలసి ఆనందం పాలుపంచుకోవాలని ఉద్దేశంతో వృద్ధాశ్రమంలో అన్నదానం ఏర్పాటు చేశామన్నారు.వరప్రసాద్, శివారెడ్డి, గూడూరు లక్ష్మీ రంగయ్య, బీసీ ఓబులేసు,గణేష్ రెడ్డి,అమర్నాథ్ రెడ్డి, రవి,దస్తగిరి,మాబు వలి పాల్గొన్నారు.